Sukumar: మమ్మల్ని అంతగా నమ్మొద్దు తల్లీ.... మేం మృగాళ్లం: దర్శకుడు సుకుమార్ ఆవేదన

  • శంషాబాద్ ఘటనపై సుకుమార్ స్పందన
  • సంతాప కార్యక్రమానికి హాజరైన సుకుమార్
  • ఎమోషనల్ అయిన దర్శకుడు

శంషాబాద్ ఘటనపై దర్శకుడు సుకుమార్ తీవ్ర భావోద్వేగాలతో స్పందించారు. వెటర్నరీ వైద్యురాలి సంతాపంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో సుకుమార్ మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నేరస్తులు ఎక్కడి నుంచో రారని, మన మధ్యే తయారవుతారని అన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఘోరాలను చెప్పడానికి తాను సరిపోనని వ్యాఖ్యానించారు.

"వెటర్నరీ వైద్యురాలు ఆ సమయంలో 100 నంబరుకు ఫోన్ చేయాల్సిందని చాలామంది చెబుతున్నారు. కానీ నలుగురు కుర్రాళ్లు హెల్ప్ చేస్తామని ముందుకు వస్తే తాను 100 నంబరుకు ఫోన్ చేయడం ఏం బాగుంటుందని ఆ అమ్మాయి భావించి ఉంటుంది. సాయం చేయడానికి వస్తే పోలీసులను పిలుస్తావా అక్కా అని వాళ్లు అడిగితే తాను ఏంచెప్పగలనని ఆమె అనుకుని ఉండొచ్చు. అమ్మాయిలు అబ్బాయిల్ని అంతగా నమ్ముతారు. కానీ తల్లీ, దయచేసి మమ్మల్ని నమ్మొద్దమ్మా! మేం మృగాళ్లం. సొంతవాళ్లను కూడా నమ్మొద్దు తల్లీ. ప్రతి ఒక్కరినీ అనుమానించండి... అనుమానం వస్తే ముందు 100 నంబరుకు ఫోన్ చేయండి. ఒకవేళ మనం పొరబడితే క్షమాపణ అడుగుదాం అంతే తప్ప ప్రమాదంలో చిక్కుకోవద్దు" అంటూ ఉద్వేగభరితంగా మాట్లాడారు.

More Telugu News