Pawan Kalyan: రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న పవన్ కల్యాణ్

  • సీమలో పవన్ పర్యటన
  • రైల్వే కోడూరులో బహిరంగ సభ
  • ఈ సాయంత్రం తిరిగి తిరుపతి చేరుకోనున్న జనసేనాని

జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ రాయలసీమ పర్యటనకు తరలివెళ్లారు. ఆయన కొద్దిసేపటి క్రితమే చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రైల్వే కోడూరు వెళతారు. ఈ సాయంత్రం తిరిగి తిరుపతి చేరుకుంటారు. కాగా, కడప జిల్లా రైల్వే కోడూరులో జనసేన పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తోంది. ఇక్కడి పాత బస్టాండు సమీపంలో జరిగే ఈ సభకు జనసేన శ్రేణులు భారీగా హాజరయ్యే అవకాశాలున్నాయి. మార్కెట్ యార్డు నుంచి పవన్ ఓపెన్ టాప్ జీపులో సభాస్థలి చేరుకోనున్నారు.

More Telugu News