Priyaanka Reddy: వెటర్నరీ వైద్యురాలి కేసులో కొంత పోలీసుల తప్పు... ముగ్గురి సస్పెండ్!

  • ఆచూకీ తెలియడం లేదని ఫిర్యాదు
  • తమ పరిధిలోకి రాదన్న శంషాబాద్ పోలీసులు
  • ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసిన సజ్జన్నార్

వెటర్నరీ వైద్యురాలి హత్య కేసులో ముగ్గురు పోలీసులు సస్పెండ్ అయ్యారు. ఫిర్యాదు అందిన తరువాత నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు నిజమని తేలడంతో సీపీ సజ్జన్నార్, వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె సెల్ ఫోన్ స్విచ్చాఫ్ అవుతోందని, ఆమె ఆచూకీ తెలియడం లేదని శంషాబాద్ పోలీసులకు తొలుత ఫిర్యాదు అందగా, వారు స్పందించకుండా, ఆ ప్రాంతం తమ పరిధిలోకి రాదని చెప్పినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

వెటర్నరీ వైద్యురాలి తల్లిదండ్రులు ముందుగానే సమాచారం ఇచ్చినా, పోలీసులు స్పందించలేదని తేలడంతో తీవ్రంగా పరిగణించిన సజ్జన్నార్, శంషాబాద్‌ ఎస్సై రవికుమార్‌, హెడ్‌ కానిస్టేబుళ్లు వేణుగోపాల్‌ రెడ్డి, సత్యనారాయణగౌడ్‌ లపై చర్యలు తీసుకున్నారు.

More Telugu News