Jagan: సీఎం జగన్ ఆర్నెల్ల పాలనపై టీడీపీ పుస్తకం

  • విజయవాడలో పుస్తకాన్ని ఆవిష్కరించిన యనమల
  • మంచి సీఎం కాదు ముంచే సీఎం అంటూ విమర్శలు
  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని వ్యాఖ్యలు

మంచి సీఎం కాదు, జనాన్ని ముంచే సీఎం అంటూ  సీఎం జగన్ ఆర్నెల్ల పాలనపై టీడీపీ పుస్తకం వెలువరించింది. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శనాస్త్రాలు సంధించారు. అవినీతి కేసుల్లో న్యాయస్థానానికి వెళ్లే సీఎం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ ఆర్నెల్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని తెలిపారు.

టీడీపీ పాలనలో ఆదాయం పెరిగింది, దాంతో పాటే ఖర్చులు కూడా పెరిగాయని, కానీ ఇప్పుడు ఆదాయం పూర్తిగా పడిపోయిందని ఆరోపించారు. ప్రభుత్వంలో ఏ కార్యక్రమాలు జరగకపోవడానికి ప్రధాన కారణం ఇదేనని అన్నారు. కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారని యనమల మండిపడ్డారు.

More Telugu News