Disha: షాద్ నగర్ పోలీస్ స్టేషన్ కే వచ్చిన మేజిస్ట్రేట్

  • పీఎస్ ఎదుట భారీ సంఖ్యలో నిరసనకారులు
  • స్టేషన్ కే వచ్చిన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ పాండునాయక్
  • రిమాండ్ కు తరలించే అవకాశం

ప్రియాంక హత్య కేసు నిందితులను మేజిస్ట్రేట్ ఎదుట పోలీసులు ప్రవేశపెట్టారు. అయితే, ఏ కోర్టులోనే మాత్రం కాదు. పరిస్థితులు ఉద్రిక్తభరితంగా ఉండటంతో నిందితులను పీఎస్ నుంచి బయటకు తీసుకొచ్చే అవకాశం లేకపోయింది. ఈ నేపథ్యంలో, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (తహసీల్దార్) పాండునాయక్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు.

ఈ సందర్భంగా ఆయన ముందు నిందితులను పోలీసులు ప్రవేశపెట్టారు. నిందితులను రిమాండ్ కు తరలించే అవకాశం ఉంది. మరోవైపు, పీఎస్ ఎదుట తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులను అక్కడి నుంచి బలవంతంగా పంపించివేసేందుకు పోలీసులు యత్నించారు.

More Telugu News