Hyderabad: 'ప్రియాంక రెడ్డి' కేసులో ఐదో నిందితుడు లేడు: డీసీపీ ప్రకాశ్ రెడ్డి

  • ఆమె హత్య కేసులో నలుగురు నిందితులు మాత్రమే ఉన్నారు
  • కోర్టుకి అన్ని ఆధారాలు సమర్పిస్తాం
  • నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తాం
  • కాసేపట్లో నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలిస్తాం

వైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్యాచారం కేసుపై శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి మీడియాకు ఈ రోజు మరికొన్ని వివరాలు తెలిపారు. ఆమె హత్య కేసులో నలుగురు నిందితులు మాత్రమే ఉన్నారని తెలిపిన ఆయన... ఐదో నిందితుడు ఉన్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. తాము కోర్టుకి అన్ని ఆధారాలు సమర్పించి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని అన్నారు. కాసేపట్లో నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలిస్తామని తెలిపారు. కాసేపట్లో షాద్ నగర్ ఆసుపత్రిలో నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.  

More Telugu News