Congress: హత్యాకాండలో పాల్గొన్న మహిళా మావోయిస్టును అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

  • సుమిత్రా పూనంను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
  • 2013లో 26 మంది కాంగ్రెస్ నేతల హత్య
  • ఆ దళంలో కీలక సభ్యురాలిగా పూనం

26 మంది కాంగ్రెస్ నేతలను హత్య చేసిన కేసులో నిందితురాలు, కరుడుగట్టిన మహిళా మావోయిస్టు సుమిత్రా పూనం అలియాస్ సుమిత్రక్కను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు అరెస్టు చేశారు. చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాకు చెందిన సుమిత్ర.. మే 25, 2013న  సుక్మాజిల్లా దర్బా లోయలో కాంగ్రెస్ నాయకులపై దాడిచేసిన పుష్పల్ దళ సభ్యురాలు. ఈ దాడిలో  కాంగ్రెస్ నాయకులు మహేంద్రకర్మ, నందకుమార్ పటేల్, మాజీ ఎమ్మెల్యే ఉదయకుమార్ ముదలియార్లతో పాటు 26 మంది ప్రాణాలు కోల్పోయారు.

కాంగ్రెస్ నాయకులపై దాడిలో మొత్తం 39 మంది మావోయిస్టులు పాల్గొన్నారు. వారిలో ఇప్పటికే పదిమందిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు ఎన్‌కౌంటరులో ప్రాణాలు కోల్పోయారు. 27 మంది పరారీలో ఉన్నారు.

More Telugu News