Telangana: నాంపల్లి రైల్వే స్టేషన్ కింద అగ్ని ప్రమాదం

  • స్టేషన్ కింద ఉన్న పాత భవనంలో మంటలు
  • ఆ ప్రాంతమంతా అలముకున్న పొగలు
  • స్పందించిన అగ్నిమాపక సిబ్బంది.. మంటల నియంత్రణ

హైదరాబాద్ లోని నాంపల్లి రైల్వే స్టేషన్ కింద అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోజు సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్టేషన్ కింద ఉన్న పాత భవనంలో మంటలు రేగడంతో ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను నియంత్రించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 

More Telugu News