Kanna lakshminarayana: విమర్శిస్తే విరుచుకుపడతారా?: వైసీపీ నేతలపై కన్నా ఆగ్రహం

  • సమస్యలను పక్కదోవ పట్టిస్తున్నారు
  • భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం అలక్ష్యం చేస్తోంది
  • మద్యం మీద ఉన్న శ్రద్ధ ఇసుకమీద లేదు  

చంద్రబాబుపాలన, జగన్ పాలన మధ్య తేడా లేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం కార్యకర్తలకు, కావాల్సిన వారికే ఉద్యోగాలు ఇస్తోందన్నారు. భవన నిర్మాణ కార్మికులను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇసుకపాలసీ పేరుతో కృత్రిమ కొరతను సృష్టించారన్నారు. వైసీపీ ప్రభుత్వానికి మద్యం మీద ఉన్న శ్రద్ధ ఇసుక మీద లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై వైసీపీ నేతలు విరుచుకుపడుతూ సమస్యలను పక్కదోవపట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

More Telugu News