Rahul Gandhi: ప్రజ్ఞా సింగ్ ఉగ్రవాదంటూ రాహుల్ గాంధీ తీవ్ర విమర్శ

  • ఉగ్రవాదైన గాడ్సేను దేశభక్తుడని అనడం విడ్డూరం
  • పార్లమెంట్ చరిత్రంలో ఇదొక దుర్దినం
  • ట్విట్టర్ వేదికగా రాహుల్ మండిపాటు

మహాత్మా గాంధీని హత్యచేసిన గాడ్సే దేశభక్తుడంటూ ఎంపీ  ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ రెండు రోజుల క్రితం లోక్ సభలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ఆమె కూడా ఓ ఉగ్రవాదని ఆరోపించారు. ట్విట్టర్ వేదికగా  ప్రజ్ఞా సింగ్ ను విమర్శించారు.  ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ద్వారా ఆరెస్సెస్, బీజేపీ నేతల మనసులోని మాటే బయటకు వచ్చిందన్నారు. ‘ఉగ్రవాది ప్రజ్ఞా సింగ్.. ఉగ్రవాది అయిన గాడ్సేను దేశభక్తుడని అన్నారు. పార్లమెంట్ చరిత్రలో ఇదో దుర్దినం’ అని ట్వీట్ చేశారు.

More Telugu News