Hyderabad: యువకుడి వేధింపులు తాళలేక.. ట్యాంక్ బండ్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని వెళ్లిన అమ్మాయి

  • ఆత్మహత్య చేసుకుంటానని తండ్రికి లేఖ  
  • హాస్టల్ గదిలో మంచంపై దొరికిన లేఖ 
  • నారాయణ గూడలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతోన్న అమ్మాయి

ఆత్మహత్య చేసుకుంటానని తండ్రికి లేఖ రాసి, తాను ఉంటోన్న హాస్టల్ గదిలో దాన్ని ఉంచి వెళ్లిపోయిందో అమ్మాయి. ఆమె ఉంటోన్న హాస్టల్ గదిలో మంచంపై ఆ లేఖ లభ్యమైంది. నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన ఓ అమ్మాయి.. హైదరాబాద్, నారాయణ గూడలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రథమ సంవత్సరం చేరింది. ఈ క్రమంలో హిమాయత్ నగర్ లో ఓ హాస్టల్ లో ఉంటూ చదువు కొనసాగిస్తోంది.

తన కుమార్తెను ఓ వ్యక్తి వేధిస్తున్నట్లు నారాయణ గూడ పోలీసులకు ఆమె తండ్రి నిన్ననే ఫిర్యాదు చేసి వెళ్లారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంతలోనే ఆ విద్యార్థిని ట్యాంక్ బండ్ నుంచి దూకి చనిపోతానని తండ్రికి లేఖ రాసి వెళ్లింది.

More Telugu News