Sensex: లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 110 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 50 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 2.68 శాతం మేర లాభపడ్డ ఐసీఐసీఐ, ఇండస్ ఇండ్ బ్యాంకులు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఆటోమొబైల్స్ మినహా అన్ని సూచీలు లాభాల్లో క్లోజ్ అయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 110 పాయింట్ల లాభంతో 41,130కి పెరిగింది. నిఫ్టీ 50 పాయింట్లు లాభపడి 12,151 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (2.68%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.68%), యస్ బ్యాంక్ (2.64%), టాటా స్టీల్ (2.53%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.56%).

టాప్ లూజర్స్:
హీరో మోటో కార్ప్ (-2.13%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.85%), బజాజ్ ఆటో (-0.84%), మారుతి సుజుకి (-0.70%), టాటా మోటార్స్ (-0.57%).

More Telugu News