Mahesh Babu: 'సరిలేరు నీకెవ్వరు'లో ఐటమ్ సాంగ్ ఒక ఊపు ఊపేస్తుందట

  • ముగింపు దశలో 'సరిలేరు నీకెవ్వరు'
  • ఐటమ్ సాంగులో పూజా హెగ్డే 
  • జనవరి 11న ప్రేక్షకుల ముందుకు 

అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' షూటింగ్ చకచకా జరిగిపోతోంది. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ ను మహేశ్ బాబు - పూజా హెగ్డే లపై చిత్రీకరించినట్టు సమాచారం.

ఈ ఐటమ్ సాంగ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఐటమ్ సాంగ్ రాలేదనీ, జనంలోకి ఒక రేంజ్ లో ఈ సాంగ్ దూసుకుపోవడం ఖాయమని చెబుతున్నారు. న్యూ ఇయర్లో ఎక్కడ చూసినా ఈ సాంగే వినిపిస్తుందని అంటున్నారు. ముఖ్యంగా ఈ సాంగ్ కుర్రకారును ఒక ఊపు ఊపేస్తుందని  చెబుతున్నారు. అతిత్వరలో ఈ సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. జనవరి 11వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News