Pawan Kalyan movie tholi prema song remade: పవన్ కల్యాణ్ ‘తొలిప్రేమ’లోని పాట రీమేక్!

  • ‘మిస్ మ్యాచ్’ చిత్రంలో అలరించనున్న ‘మనసే...’ అన్న సాంగ్
  • సామాజిక మాధ్యమంగా పాట ప్రోమో విడుదల
  • హీరో ఉదయ్ శంకర్ ,హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ పై చిత్రీకరణ

పవన్ కల్యాణ్, కీర్తి రెడ్డి హీరో, హీరోయిన్లుగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘తొలి ప్రేమ‘ లోని ఈ మనసే .... అనే పాటను ‘మిస్ మ్యాచ్’ చిత్రం కోసం రీమేక్ చేశారు. అప్పట్లో ఈ పాట ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. నిర్మల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న మిస్ మ్యాచ్ చిత్రంలో హీరోగా ఉదయ్ శంకర్ నటిస్తుండగా, హీరోయిన్ గా ఐశ్యర్య రాజేష్ కథానాయికగా నటిస్తున్నారు.  

'ఆటగదరా శివా' చిత్రంతో ఉదయ్ తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇటీవల ఈ సినిమాలోని మొదటి పాటను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మనసే.. పాట ప్రోమోను చిత్ర బృందం సామాజిక మాధ్యమంగా ఈ రోజు విడుదల చేసింది. ఈ పాటను పవన్ కల్యాణ్ కు అంకితం చేస్తున్నట్లు పేర్కొంది. త్వరలోనే పూర్తి పాటను రీలీజ్ చేస్తామని చిత్రబృందం తెలిపింది.

More Telugu News