suma: యాంకర్ సుమ విసిరిన ఛాలెంజ్ ను స్వీక‌రించి.. మొక్కనాటి సెల్ఫీ దిగిన మంచు లక్ష్మి

  • ‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్ ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్
  • ఇటీవల మంచు లక్ష్మికి సుమ ఛాలెంజ్
  • ఇందులో భాగం అయినందుకు మంచు లక్ష్మి హర్షం

టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ ‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. యాంకర్ సుమ ఈ ఛాలెంజ్ ను స్వీకరించి ఇటీవల మొక్కలు నాటి జూనియర్ ఎన్టీఆర్, మంచు లక్ష్మి, బిగ్ బాస్ సీజన్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్, యాంకర్ ఓంకార్ కు ఆమె ‘గ్రీన్ ఛాలెంజ్’ విసిరింది. ఆ ఛాలెంజ్ ను మంచు లక్ష్మి స్వీకరించింది.

త‌న ఇంటి ఆవరణలో మొక్క నాటి, దానితో సెల్ఫీ తీసుకుంది. ఇందులో తాను భాగం అయినందుకు హర్షం వ్యక్తం చేసింది. కాగా, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ కూడా స్వీకరించి తన ఇంటి ప్రాంగణంలో మూడు మొక్కలు నాటిన విషయం తెలిసిందే. ఇప్పటికే బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కూడా ఈ ఛాలెంజ్ స్వీకరించింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు వారంతా అభినందనలు తెలిపారు.

More Telugu News