Manikyala Rao: వైసీపీని ఎందుకు గెలిపించామా అని ప్రజలు అనుకుంటున్నారు: బీజేపీ నేత మాణిక్యాలరావు

  • మీడియా స్వేచ్ఛను హరించేలా జీవోలను తీసుకొచ్చారు
  • అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతాం
  • రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటోంది

వైసీపీ పాలన అస్తవ్యస్తంగా ఉందని బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు అన్నారు. వైసీపీని అనవసరంగా గెలిపించామని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. మీడియా స్వేచ్ఛను కూడా హరించేలా జీవోలను తీసుకురావడం దారుణమని అన్నారు. అధికారపక్ష నేతల అవినీతిపై పోరాడుతామని చెప్పారు. బీజేపీలో చేరేందుకు పలువురు టీడీపీ నేతలు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. ఏపీలో టీడీపీ పూర్తిగా మూతపడ్డా ఆశ్చర్యం లేదని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటోందని... ఏపీలో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని అన్నారు.

More Telugu News