Chandrababu: కాన్వాయ్ పై రాళ్లదాడి... పగిలిన చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సు అద్దం!

  • వెంకటపాలెం సమీపంలో ఘటన
  • లాఠీచార్జ్ చేసిన పోలీసులు
  • అమరావతి మట్టికి చంద్రబాబు నమస్కారం

గుంటూరు జిల్లా వెంకటపాలెం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు, చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సుపై రాళ్లు రువ్వడంతో బస్సు అద్దం పగిలింది. దీంతో ఆ ప్రాంతమంతా తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఆపై రోప్ పార్టీని రంగంలోకి దించి, కాన్వాయ్ ముందుకు సాగేందుకు సహకరించారు.

బాబు ప్రయాణిస్తున్న బస్సు మినహా, మిగతా టీడీపీ నాయకుల వాహనాలను వెంకటపాలెంలోకి అనుమతించేది లేదని పోలీసు అధికారులు చెప్పడంతో, తెలుగుదేశం పార్టీ నాయకులు వాగ్వాదానికి దిగారు. అంతకుముందు చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సుపై చెప్పులను కూడా విసిరిన సంగతి తెలిసిందే. కాగా, ఆయన కాన్వాయ్ ఉద్ధండరాయుని పాలెం చేరుకోగానే, అమరావతికి శంకుస్థాపన చేసిన స్థలంలోని మట్టికి చంద్రబాబునాయుడు నమస్కరించారు.

More Telugu News