Chandrababu: అమరావతిలో తీవ్ర ఉద్రిక్తత... చంద్రబాబు వాహనంపై చెప్పులు విసిరిన ఓ వర్గం!

  • చంద్రబాబు అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ
  • పోటా పోటీ నినాదాలతో వేడెక్కిన అమరావతి
  • ఇరు వర్గాలనూ చెదరగొట్టిన పోలీసులు

నేటి ఉదయం ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు చేపట్టిన అమరావతి యాత్ర తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బాబు పర్యటనకు అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య వెంకటపాలెంలో ఘర్షణ జరిగింది. చంద్రబాబు కాన్వాయ్ ని చూడగానే ఓ వర్గం వారు ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై చెప్పులు, కర్రలతో దాడి చేశారు. పోటాపోటీగా నినాదాలు చేశారు. బాబు కాన్వాయ్ వైపు దూసుకెళ్లేందుకు ఓ వర్గం రైతులు విఫలయత్నం చేయడంతో, పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారిని చెదరగొట్టి, కాన్వాయ్ కి దారి కల్పించారు. ఇలా బాబు పర్యటన ఓ వైపు స్వాగతం, మరోవైపు నిరసనల మధ్య సాగుతోంది.

More Telugu News