Ram: మహేశ్ బాబు తరువాత రామ్ ని లైన్లో పెట్టిన అనిల్ రావిపూడి

  • వరుస విజయాల దర్శకుడిగా అనిల్ రావిపూడి 
  • కథ విన్న వెంటనే ఓకే చెప్పేసిన రామ్ 
  • వచ్చే ఏడాది పట్టాల పైకి

కథలో లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ సమపాళ్లలో ఉండేలా చూసుకునే దర్శకులలో, త్రివిక్రమ్ తరువాత అనిల్ రావిపూడి పేరును చెప్పుకోవచ్చు. వరుస విజయాలను అందుకుంటూ వస్తున్న ఆయన, తన తాజా చిత్రంగా 'సరిలేరు నీకెవ్వరు' సినిమాను రూపొందిస్తున్నాడు. మహేశ్ బాబు - రష్మిక జంటగా నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు.

ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి ఏ హీరోతో చేయనున్నాడనే ఆసక్తి అభిమానుల్లో వుంది. ఈ నేపథ్యంలోనే 'రామ్' పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అనిల్ రావిపూడి 'రాజా ది గ్రేట్' సినిమాను రామ్ తోనే చేయాలనుకున్నాడుగానీ కుదరలేదు. ఇటీవల ఆయన మళ్లీ రామ్ ను కలిసి ఒక కథ వినిపించగా వెంటనే రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. రామ్ చేస్తున్న 'రెడ్' సినిమా షూటింగు పూర్తికాగానే, ఈ కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అంటున్నారు.

More Telugu News