Chittoor District: కాలభైరవ ఆలయంలో తాంత్రిక పూజల ఘటన.. విచారణకు ఆదేశించిన మంత్రి వెల్లంపల్లి

  • అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న మంత్రి 
  • శాఖాపరమైన విచారణకు ఆదేశం
  • 24 గంటల్లోగా పూర్తి స్థాయి నివేదిక అందజేయాలని ఆదేశం

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని కాలభైరవ ఆలయంలో కొంత మంది తమిళులు తాంత్రిక పూజలు నిర్వహించిన ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. ఈ మేరకు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వెంటనే శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. ఇరవై నాలుగు గంటల్లోగా పూర్తి స్థాయి నివేదికను అందజేయాలని ఆదేశించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కాళహస్తి ఏఈవో ధనపాల్‌ ను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ఆలయ సెక్యూరిటీ గార్డుల కోసం గాలిస్తున్నారు.

More Telugu News