Andhra Pradesh: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం..వైఎస్సార్ కాపు నేస్తం పథకానికి ఆమోదం

  • దాదాపు మూడు గంటల పాటు కొనసాగిన సమావేశం
  • కాపు నేస్తం పథకానికి రూ.1101 కోట్ల కేటాయింపు
  • డిసెంబర్ 26న కడప స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన

ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం దాదాపు మూడు గంటల పాటు కొనసాగింది. అనంతరం, మీడియాతో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను వివరించారు.  

- వైఎస్సార్ కాపు నేస్తం పథకానికి రూ.1101 కోట్లు కేటాయింపు. ఆ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు ఏడాదికి రూ.15 వేల ఆర్థికసాయం అందించడానికి, 45 ఏళ్లు నిండిన ప్రతి కాపు మహిళకు ఐదేళ్లలో రూ.75 వేలు అందజేసేందుకు ఆమోదం.

- టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్య 19 నుంచి 29కి పెంపు

- నవశకం సర్వే ద్వారా వివిధ ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయం.

- కడప జిల్లా జమ్మలమడుగు మండలం పెదదండ్లూరు వద్ద 3,200 ఎకరాల్లో
నిర్మించనున్న స్టీల్ ప్లాంట్ కు డిసెంబర్ 26న శంకుస్థాపనకు, ఇనుప ఖనిజం కోసం ఎన్ఎండీసీతో ఒప్పందానికి ఆమోదం.
 
-ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం

- సంక్షేమ పథకాల కింద వేర్వేరు కార్డుల జారీకి, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి, ఆంధ్రప్రదేశ్ పవర్ కార్పొరేషన్ కు బ్యాంకు నుంచి రుణాలు పొందేందుకు, మద్యం ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం.

- జగనన్న వసతి దీవెన పథకం కింద రూ.2,300 కోట్లు, జగనన్న విద్యా దీవెన పేరిట ఫీజు రీయింబర్స్ మెంట్ కు రూ.3,400 కోట్లు కేటాయింపు.

- ఆరోగ్యశ్రీ కార్డుల జారీకి, కాంట్రాక్టు ఉద్యోగుల అంశంపై కమిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం

- ఏపీఎస్పీడీసీఎల్ ను విభజించి సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్  ఏర్పాటుకు నిర్ణయం

More Telugu News