Nara Lokesh: పిచ్చికి కూడా ఓ హద్దుంటుంది... జగన్ పిచ్చికి మాత్రం లేదు: నారా లోకేశ్

  • నాగార్జున వర్శిటీలో వైఎస్ఆర్ విగ్రహం
  • ఇది అధికార దుర్వినియోగమే
  • ట్విట్టర్ లో నారా లోకేశ్

గుంటూరు జిల్లాలోని నాగార్జునా యూనివర్శిటీ ప్రాంగణంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుండటాన్ని మాజీ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "ప్రతి పిచ్చికీ ఓ పద్ధతుంటుంది. కానీ, జగన్ పిచ్చిన మాత్రం అది ఉన్నట్టు కనిపించడం లేదు. నాగార్జునా విశ్వవిద్యాలయంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అనుకోవడం అధికారాన్ని దుర్వినియోగం చేయడమే. స్వీయ స్తుతికి అధికారాన్ని వాడుతున్నారు" అని లోకేశ్ మండిపడ్డారు.

More Telugu News