Road Accident: హైదరాబాద్ లో కారు బీభత్సం.. పల్టీలు కొట్టి మెట్రో డివైడర్‌ను ఢీకొట్టిన వైనం.. అక్కాచెల్లెళ్లకు తీవ్రగాయాలు

  • ఒకరి పరిస్థితి విషమం
  • జింకలబావి కాలనీకి చెందిన అక్కాచెల్లెళ్లుగా గుర్తింపు
  • డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్ లోని ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న ఎన్టీఆర్‌నగర్ లో ఈ రోజు ఉదయం అతి వేగంగా వచ్చిన ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుతోన్న ఇద్దరు మహిళలను ఢీకొట్టడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వారిద్దరు జింకలబావి కాలనీకి చెందిన అక్కాచెల్లెళ్లుగా గుర్తించారు.

మహిళలను ఢీ కొట్టిన అనంతరం ఆ కారు పల్టీలు కొట్టి మెట్రో డివైడర్‌ను ఢీకొట్టింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఓజోన్ ఆసుపత్రికి తరలించారు. బాధితులు వెంకటమ్మ, సత్తమ్మలుగా పోలీసులు గుర్తించారు. ఆ కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

More Telugu News