Maharashtra: క్లైమాక్స్ కు చేరుకున్న మహారాష్ట్ర రాజకీయాలు.. ప్రమాణస్వీకారం చేస్తున్న ఎమ్మెల్యేలు

  • కొలువుదీరిన మహారాష్ట్ర అసెంబ్లీ
  • కొత్త ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేయిస్తున్న ప్రొటెం స్పీకర్
  • సీఎంగా రేపు ప్రమాణస్వీకారం చేయనున్న ఉద్ధవ్ థాకరే

గత కొన్ని రోజులుగా ఊహించని మలుపులు తిరుగుతూ, ఉత్కంఠను రేకెత్తించిన మహారాష్ట్ర రాజకీయాలు క్లైమాక్స్ కు చేరుకున్నాయి. కావాల్సినంత సంఖ్యాబలం లేకపోవడంతో సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా చేశారు. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

 ఈ నేపథ్యంలో ఈరోజు మహారాష్ట్ర శాసనసభ కొలువుదీరింది. ప్రొటెం స్పీకర్ గా ఎంపికైన కాళిదాస్ కొలంబ్కర్ కొత్త ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. అంతకు ముందు అసెంబ్లీకి వచ్చిన ఫడ్నవీస్ ని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ఆప్యాయంగా పలకరించారు.

More Telugu News