Andhra Pradesh: ఏపీ టీడీపీ నేతలకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు

  • స్పీకర్ గౌరవాన్ని భంగపర్చే వ్యాఖ్యల ఎఫెక్ట్
  • అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ కు  నోటీసులు
  • సమాధానం ఇచ్చేందుకు వారం రోజుల గడువు

ఏపీ స్పీకర్ గౌరవాన్ని భంగపర్చేలా టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో వారికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు అందాయి. స్పీకర్‌ తమ్మినేని సీతారాంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను ఈ నోటీసులు అందినట్టు సమాచారం. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ సభాహక్కుల నోటీసులను వారికి ఇవాళ పంపారు. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. కాగా, స్పీకర్ స్థానాన్ని కించపరిచేలా వీరిద్దరూ వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతల ఆరోపణలు.

More Telugu News