Rayalaseema: రాయలసీమలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన ఖరారు

  • డిసెంబరు 1 నుంచి ఆరు రోజుల పాటు పవన్ పర్యటన
  • సమస్యలపై రైతాంగం, మేధావులతో పలు చర్చలు
  • జనసేన శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న పవన్

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ త్వరలో రాయలసీమ ప్రాంతంలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఆ వివరాలను తెలియజేస్తూ పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ ఓ ప్రకటన విడుదల చేశారు. డిసెంబరు 1వ తేదీ నుంచి ఆరు రోజుల పాటు రాయలసీమ జిల్లాల్లో పవన్ కల్యాణ్ పర్యటన ఖరారైనట్టు తెలిపారు. ఈ పర్యటనలో రాయలసీమ జిల్లాల్లో ఆయా సమస్యలపై రైతాంగం, మేధావులతో పలు చర్చలు చేపడతారని అన్నారు.

పవన్ కల్యాణ్ పర్యటన వివరాలు..

-1వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు రేణిగుంట విమానాశ్రయానికి పవన్ చేరుకుంటారు. అక్కడి నుంచి కడప జిల్లాకు వెళ్తారు, మూడు గంటలకు రైల్వే కోడూరు చేరుకుని జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రైతులతో చర్చిస్తారు.

- 2వ తేదీ ఉదయం పది గంటలకు తిరుపతి, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పోటీ చేసిన అభ్యర్థులు, జనసేన నాయకులతో సమీక్షా సమావేశం

- 3వ తేదీన కడప, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పోటీ చేసిన అభ్యర్థులు, జనసేన నాయకులతో సమీక్ష

- 4వ తేదీన మదనపల్లె చేరుకుంటారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని జనసేన శ్రేణులకు దిశా నిర్దేశం

- 5వ తేదీన అనంతపురం జిల్లా నేతలతో సమీక్షా సమావేశం. అనంతరం, స్థానిక రైతులు, చేనేత కార్మికులతో చర్చ

- 6వ తేదీన పార్టీ కార్యక్రమాల్లో పవన్ కల్యాణ్ పాల్గొంటారు. రాయలసీమ జిల్లాల్లో జనసేన నాయకులు, శ్రేణులపై అక్రమ కేసులు బనాయించడంతో ఇబ్బంది పడుతున్న వారికి పవన్ భరోసా కల్పించనున్నారు.

More Telugu News