Dhanush: ఆ హీరోకి .. దర్శకుడికి మధ్య విభేదాలు ఒక రేంజ్ లో వున్నాయట!

  • ధనుశ్ తాజా చిత్రంగా  'ఎన్నై నోకి పాయుమ్ తోట' 
  • తెలుగు టైటిల్ గా 'తూటా'
  • ఈ నెల 29వ తేదీన రెండు భాషల్లోను విడుదల

ఒక ప్రాజెక్టుపై కలిసి పనిచేస్తున్నప్పుడు సహజంగానే అభిప్రాయభేదాలు తలెత్తుతుంటాయి. అయితే అవి స్థాయిని దాటి వెళితే ఆ ప్రాజెక్టు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని ఇటు ధనుశ్ గానీ .. అటు గౌతమ్ మీనన్ గాని ఎంతమాత్రం గ్రహించడం లేదనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది.

ధనుశ్ హీరోగా గౌతమ్ మీనన్ 'ఎన్నై నోకి పాయుమ్ తోట' అనే సినిమాను రూపొందించాడు. మేఘ ఆకాశ్ కథానాయికగా నటించిన ఈ సినిమా విషయంలో, గౌతమ్ మీనన్ కి .. ధనుశ్ కి మధ్య ఎక్కడో అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఈ కారణంగానే ఈ సినిమా పూర్తి కావడానికి రెండేళ్లకి పైగా పట్టింది. ఇప్పుడు ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోను ఈనెల 29న విడుదల చేయనున్నారు. తెలుగులో 'తూటా' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా విషయంలో దర్శకుడిని ధనుశ్ పక్కన పెట్టేశాడని కొంతమంది అంటుంటే,  గౌతమ్ మీనన్ ఈ సినిమాను గురించి పట్టించుకోవడం లేదని మరికొందరు చెప్పుకుంటున్నారు.

More Telugu News