Mahesh Babu: 'సరిలేరు నీకెవ్వరు' నుంచి ఇంట్రెస్టింగ్ అప్ డేట్

  • టాకీ పార్టును పూర్తిచేసుకున్న 'సరిలేరు నీకెవ్వరు'
  • రెండు పాటలు మాత్రమే పెండింగ్ 
  • జనవరి 11వ తేదీన విడుదల

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ బాబు కథానాయకుడిగా 'సరిలేరు నీకెవ్వరు' రూపొందుతోంది. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా రీసెంట్ గా టాకీపార్టును పూర్తి చేసుకుంది. ఇంకా రెండు పాటలను మాత్రమే చిత్రీకరించవలసి ఉందట. ఒక పాటను హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో, మరో పాటను అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా ద్వారా విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాను జనవరి 11వ తేదీన విడుదల చేయనున్నారు.  'మహర్షి' సినిమాతో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేశ్ బాబు, సంక్రాంతికి ఏ స్థాయిలో సందడి చేస్తాడో చూడాలి మరి.

More Telugu News