Chota K Naidu: సాయికుమార్ వాళ్లమ్మగారు నన్ను చూడగానే చెప్పారు: చోటా.కె నాయుడు

  • రోజుకి 15 రూపాయలు ఇచ్చేవారు 
  • కెమెరామెన్ గా అవకాశాల కోసం తిరిగాను 
  • అక్క సాయం చేసిందన్న చోటా

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో కెమెరా మెన్ చోటా.కె నాయుడు మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన విషయాలను గురించి ప్రస్తావించారు. "సీనియర్ కెమెరామెన్ల దగ్గర పనిచేసేటప్పుడు నాకు రోజుకి 15 రూపాయల 'బేటా' ఇచ్చేవారు. నా అవసరాలకి ఆ డబ్బు సరిపోయేది. అయితే ఆ పనులు వదిలేసి కెమెరా మెన్ గా అవకాశాల కోసం తిరగడం మొదలుపెట్టాను.

ఆ సమయంలో నా దగ్గర డబ్బులేకపోతే మా అక్కయ్య సాయం చేసేది. ఆ తరువాత 'మర్యాద రామన్న' సీరియల్ కి కెమెరామెన్ గా పనిచేశాను. అందులో సాయికుమార్ తండ్రిగారు పీజే శర్మ కూడా నటించారు. ఒకరోజున పీజే శర్మగారితో పాటు ఆయన శ్రీమతి కూడా షూటింగుకి వచ్చారు. ఆమె ముఖంలో లక్ష్మీకళ ఉట్టిపడేది. నన్ను చూడగానే పిలిచి పేరేమిటని అడిగారు. 'భవిష్యత్తులో నువ్వు చాలా పెద్దవాడవవుతావు' అన్నారు. అప్పుడు చాలా సంతోషంగా .. గర్వంగా అనిపించింది" అని చెప్పుకొచ్చారు.

More Telugu News