kcr: కేసీఆర్ పెంపుడు శునకం హస్కీ మృతి కేసు క్లోజ్!

  • ప్రగతి భవన్ లో మరణించిన హస్కీ
  • ఇద్దరు పశువైద్యాధికారులపై క్రిమినల్ కేసు
  • సహజ మరణమేనని తేలడంతో కేసు మూసివేత

కేసీఆర్ ప్రేమగా పెంచుకుంటున్న శునకం హస్కీ, అనుమానాస్పద మృతి కేసును హైదరాబాద్ నగర పోలీసులు మూసివేశారు. ప్రగతి భవన్ లో పెరుగుతున్న ఈ శునకం ఆలనా, పాలనపై నిర్లక్ష్యం వహించారంటూ, పశువైద్యాధికారులు డాక్టర్ రంజిత్, లక్ష్మీలపై క్రిమినల్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆపై హస్కీకి పోస్టుమార్టం చేయగా, అది సహజ మరణమేనని తేలింది. ఇదే సమయంలో ఇండియన్ వెటర్నరీ అసోసియేషన్ సైతం, ఈ కేసులో పశువైద్యాధికారులపై కేసును ఎత్తివేయాలని కోరింది. దీంతో ఈ కేసును మూసివేయాలని కోరుతూ హైదరాబాద్ సిటీ పోలీసులు స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు కేసును క్లోజ్ చేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది.

More Telugu News