EO: దైద శివాలయం ఈవో అనిత ఘటనపై మంత్రి వెల్లంపల్లి ఆదేశాలు

  • దైద శివాలయం ఈవో అనితపై అవినీతి ఆరోపణలు 
  • ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డ ఈవో అనిత
  • ఇరవై నాలుగు గంటల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు

 తనపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో, గుంటూరు జిల్లా గురజాల మండలంలోని దైద శివాలయం ఈవో అనిత ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇరవై నాలుగు గంటల్లోగా విచారణ జరిపి పూర్తి నివేదిక ఇవ్వాలని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు సమాచారం పంపారు.

More Telugu News