CAB: రెండున్నర రోజుల్లోనే ముగిసిన డేనైట్ టెస్టు... డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని 'క్యాబ్' నిర్ణయం

  • చివరి రెండ్రోజులకు టికెట్లు కొనుగోలు చేసిన ప్రేక్షకులకు నగదు వాపసు
  • సందేశాలు పంపించామన్న క్యాబ్ అధికారులు
  • నగదు వాపసు ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడి

టీమిండియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య కోల్ కతాలో జరిగిన డేనైట్ టెస్టు కేవలం రెండున్నర రోజుల్లోనే ముగిసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా పింక్ బాల్ తో జరిగిన ఆ టెస్టును భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలుచుకుంది. భారత్ విజయం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేసినా, మ్యాచ్ ఐదు రోజుల పాటు జరిగితే వచ్చే మజా వేరుగా ఉంటుందని కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో, చివరి రెండు రోజులకు మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేసిన ప్రేక్షకులకు డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) నిర్ణయించుకుంది. నాలుగు, ఐదు రోజులకు మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేసినవారికి నగదు వాపస్ చేసే ప్రక్రియ షురూ అయిందని క్యాబ్ అధికారులు వెల్లడించారు. ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్న వారికి మెసేజ్ లు పంపించామని తెలిపారు.

More Telugu News