Vote for Note Case: మరోసారి తెరపైకి ఓటుకు నోటు కేసు.. సుప్రీంకోర్టులో ఎర్లీ హియరింగ్ పిటిషన్

  • పిటిషన్ దాఖలు చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి
  • 2017లోనే పిటిషన్ వేసిన ఆళ్ల
  • పిటిషన్ లిస్ట్ కాకపోవడంతో.. మరోసారి పిటిషన్

ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనాన్ని రేకెత్తించిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. సుప్రీంకోర్టులో ఈ కేసుపై ఎర్లీ హియరింగ్ పిటిషన్ దాఖలైంది. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. 2017లోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ పిటిషన్ ను దాఖలు చేసినప్పటికీ... సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ లిస్ట్ కాలేదు.

దీంతో, ఆయన మరోసారి సర్వోన్నత న్యాయస్థానం గడప తొక్కారు. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటుకు నోటు ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎంపీ, అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఈ కేసులో విచారణ ఎదుర్కోవడంతో పాటు, కొన్ని రోజులు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇదే కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

More Telugu News