Prakash Raj: లాంఛనంగా మొదలైన 'రంగమార్తాండ'

  • మరాఠీలో విజయవంతమైన 'నట సామ్రాట్'
  • కృష్ణవంశీ దర్శకుడిగా తెలుగు రీమేక్ 
  • కీలకమైన పాత్రలో బ్రహ్మానందం 

చాలా గ్యాప్ తరువాత కృష్ణవంశీ ఒక కథను ఎంచుకున్నాడు. ఆ కథను తనదైన శైలిలో తెరపై ఆవిష్కరించడానికి రంగంలోకి దిగాడు. ఈ సినిమాకి 'రంగమార్తాండ' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నాడు. ఆ మధ్య మరాఠీలో వచ్చిన 'నట సామ్రాట్'కి ఇది రీమేక్. మరాఠీలో వచ్చిన ఈ సినిమాకి మంచి వసూళ్లతో పాటు ప్రశంసలు దక్కాయి.

అందువల్లనే ఈ సినిమాను కృష్ణవంశీ తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. మధు - అభిషేక్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను ఈ రోజున లాంఛనంగా ఆరంభించారు. ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ - రమ్యకృష్ణ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. కీలకమైన పాత్రలో బ్రహ్మానందం కనిపించనున్నారు. బ్రహ్మానందం లుక్ కొత్తగా ఉండటమే కాదు, ఈ సినిమాలో ఆయన పాత్ర కన్నీళ్లు పెట్టిస్తుందని చెబుతున్నారు.

More Telugu News