Rajani: 'దర్బార్' నుంచి ఫస్టు సింగిల్ వచ్చేస్తోంది

  • పోలీస్ ఆఫీసర్ గా రజనీకాంత్ 
  • కూతురి పాత్రలో నివేదా థామస్ 
  • సంక్రాంతికి రెండు భాషల్లో విడుదల

మురుగదాస్ - రజనీకాంత్ కాంబినేషన్లో 'దర్బార్' సినిమా రూపొందింది. ఈ సినిమాలో రజనీ కోసం ఎస్.పి. బాలు ఒక పాట పాడటం విశేషం. ఈ మధ్య కాలంలో సినిమాలకి పాడటం బాలు బాగా తగ్గించేశారు. అయితే 'దర్బార్'లోని ఒక పాటను బాలు పాడితేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని రజనీ వ్యక్తం చేయడంతో, ఆ పాట సాహిత్యం బాలూకి నచ్చడంతో ఆయన పాడినట్టుగా చెబుతున్నారు.

ఈ నెల 27వ తేదీన ఈ పాటనే ఫస్టు సింగిల్ గా వదలనున్నట్టు సంగీత దర్శకుడు అనిరుధ్ స్పష్టం చేశాడు. ఈ సినిమాలో ముంబై - సౌత్ జోన్ కి చెందిన పోలీస్ ఆఫీసర్ గా రజనీ కనిపించనున్నారు. రజనీ భార్య పాత్రలో నయనతార .. కూతురు పాత్రలో నివేదా థామస్ నటించారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేయనున్నారు. క్రేజీ కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.

More Telugu News