Chaitu: రెండూ వైవిధ్యభరితమైన పాత్రలేనంటోన్న చైతూ

  • చైతూ తాజా చిత్రంగా 'వెంకీమామ'
  • తదుపరి సినిమా శేఖర్ కమ్ములతో 
  •  వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు

వచ్చే ఏడాది నాగచైతన్య రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. బాబీ దర్శకత్వంలో ఆయన చేసిన 'వెంకీమామ' విడుదలకిగాను సరైన సమయం కోసం వెయిట్ చేస్తోంది. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతూ చేస్తున్న సినిమా ఈ మధ్యనే రెగ్యులర్ షూటింగుకి వెళ్లింది. కెరియర్ పరంగా చైతూకి ఇది 19వ సినిమా.

తాజాగా ఈ రెండు సినిమాలను గురించి చైతూ స్పందించాడు. ఈ రెండూ కూడా విభిన్నమైన కథాంశాలు కలిగినవే. అలాగే రెండూ వైవిధ్యభరితమైన పాత్రలే. ఈ పాత్రలను చేయడం నిజంగా నాకు చాలా సంతోషంగా వుంది. ఇటీవల వదిలిన రెండు టీజర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మీరంతా ఇంతలా ఆదరిస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది" అని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాల తరువాత ఆయన ఏ ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తాడో చూడాలి.

More Telugu News