sabarimala: డిసెంబరు 26న సూర్యగ్రహణం.. అయ్యప్ప ఆలయం మూసివేత

  • 26న ఉదయం 7:30 గంటల నుంచి 11:30 గంటల వరకు ఆలయం మూత
  • పంబ, మలికాపురంలోని ఆలయాలనూ మూసివేయనున్న అధికారులు
  • నాలుగు గంటలపాటు కొనసాగనున్న సూర్యగ్రహణం

వచ్చే నెల 26న సూర్యగ్రహణం కారణంగా శబరిమల అయ్యప్ప ఆలయాన్ని మూసివేయనున్నట్టు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు ప్రకటించింది. ఆ రోజు ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 11:30 వరకు నాలుగు గంటలపాటు ఆలయాన్ని మూసివేయనున్నట్టు పేర్కొంది. 26న ఉదయం 8:06 గంటలకు ప్రారంభయ్యే సూర్యగ్రహణం ఉదయం 11:13 గంటలకు ముగుస్తుంది.

ఆలయాన్ని తెరిచిన అనంతరం పుణ్యహవచన చేసి పూజలు కొనసాగిస్తారు. మాలికాపురం, పంబలో ఉన్న ఆలయాలను కూడా 26న మూసివేయనున్నట్టు ఆలయ ఈవో తెలిపారు. కాగా, మండల పూజల సందర్భంగా ఈ నెల 17న ఆలయాన్ని తెరిచారు. రికార్డు స్థాయిలో భక్తులు సందర్శించుకుంటున్నారు.

More Telugu News