ajit pawar: డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి వచ్చేయండి.. మనం ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం: అజిత్ పవార్ తో సుప్రియా సూలె కీలక భేటీ

  • తిరుగుబాటు నేత అజిత్ పవార్ తో ఎన్సీపీ సంప్రదింపులు 
  • ఆయనతో చర్చిస్తోన్న సుప్రియా సూలె, నవాబ్ మాలిక్
  • తన నివాసంలో మద్దతు దారులతోనూ చర్చించిన అజిత్ పవార్

మహారాష్ట్రలో చోటుచేసుకున్న పరిస్థితులపై వివరణ ఇవ్వాలని.. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌, ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై తదుపరి విచారణ రేపు ఉదయం 10.30 గంటలకు వాయిదా వేసింది. దీంతో తమ పార్టీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ తో ఎన్సీపీ సంప్రదింపులు జరుపుతోంది.

అజిత్ పవార్ ను మళ్లీ ఎన్సీపీలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ ఎంపీ, శరద్ పవార్ కూతురు సుప్రియా సూలె ప్రయత్నిస్తున్నారు. అజిత్ పవార్ తో సుప్రియా సూలెతో పాటు నవాబ్ మాలిక్ చర్చలు జరుపుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి వచ్చేయాలని, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని వారు ఆయనకు తెలిపారు. కాగా, అంతకు ముందు తన నివాసంలో అజిత్ పవార్ తన మద్దతు దారులతో చర్చించారు.

More Telugu News