Visakhapatnam District: విశాఖ మన్యంలో బాస్మతి బియ్యం పండిస్తాం: ఏపీ మంత్రి కన్నబాబు

  • ఈ ఏడాది ప్రయోగాత్మకంగా సాగుచేస్తామని వెల్లడి
  • అనకాపల్లిలో కిసాన్ మేళా
  • ప్రారంభించిన మంత్రి

విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధన కేంద్రంలో కిసాన్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పాల్గొన్నారు. కిసాన్ మేళాను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, విశాఖ మన్యంలో బాస్మతి బియ్యం సాగుకు ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. ఈ ఏడాది ప్రయోగాత్మకంగా బాస్మతి బియ్యం సాగుచేస్తామని తెలిపారు. రైతులకు అన్ని విధాలుగా సహకారం అందించాలని సీఎం ఆదేశించారని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు.

More Telugu News