ncp: మహారాష్ట్రలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడింది: నడ్డా, గడ్కరీ స్పందన

  • మహారాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు
  • రాష్ట్రాన్ని ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడిపిస్తుంది
  • ప్రభుత్వం ఏర్పాటు చేయడం ప్రజాస్వామ్య విజయం 

మహారాష్ట్రలో తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. 'మహారాష్ట్ర ప్రజలకు అభినందనలు.. ఫడ్నవిస్ నేతృత్వంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడింది. ప్రధాని మోదీ సూచనలతో మహారాష్ట్రలో గొప్ప పాలన కొనసాగుతుంది. రాష్ట్రాన్ని ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడిపిస్తుంది. మహారాష్ట్రలో బీజేపీ, ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ప్రజాస్వామ్య విజయం' అని అన్నారు.
 
ఇదే విషయంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పందిస్తూ... ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ లను అభినందించారు. కాగా, అజిత్ పవార్ తన పార్టీకి చెందిన 54 మంది ఎమ్మెల్యేల మద్దతు బీజేపీకేనంటూ లేఖ ఇచ్చారని బీజేపీ నేతలు అంటున్నారు. 

More Telugu News