Sarad Pawar: 'మహా' రాజకీయం: అజిత్ పవార్ నిర్ణయంతో ఎన్సీపీకి సంబంధం లేదు: శరద్ పవార్

  • ఎన్సీపీని అజిత్ పవార్ చీల్చారు
  • అజిత్ నిర్ణయం ఆయన వ్యక్తిగతం
  • ఆయన నిర్ణయానికి నా మద్దతు లేదు

రాత్రికి రాత్రే మారిపోయిన పరిణామాల మధ్య మహారాష్ట్రలో మరోసారి బీజేపీ అధికారాన్ని చేపట్టింది. ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ వర్గం మద్దతు ప్రకటించడంతో అధికార పీఠాన్ని బీజేపీ అధిష్ఠించింది. ఈ నేపథ్యంలో, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి మద్దతివ్వాలనే నిర్ణయం ఎన్సీపీది కాదని చెప్పారు. అది అజిత్ పవార్ వ్యక్తిగత నిర్ణయమని... తమ పార్టీకి దీంతో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎన్సీపీని అజిత్ పవార్ చీల్చారని తెలిపారు. అజిత్ పవార్ నిర్ణయానికి తన మద్దతు లేదని చెప్పారు.

More Telugu News