Etela Rajender: చెప్పేవాళ్లు ఎన్నైనా చెబుతారు... పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై స్పందించిన మంత్రి ఈటల

  • పార్టీ మారుతున్నట్టు ఈటలపై ప్రచారం
  • ఖండించిన ఈటల
  • గాలివార్తలపై ఇక స్పందించనని వెల్లడి

తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై తెలంగాణ వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాను ఏ పార్టీలోకి వెళ్లడంలేదని స్పష్టం చేశారు. చెప్పేవాళ్లు ఎన్నైనా చెబుతారని, గాలివార్తలపై ఇక తాను బదులివ్వదలుచుకోలేదని అన్నారు. ఈటలపై ఈ విధమైన ప్రచారం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాగే వార్తలు వచ్చాయి. అప్పుడు కూడా ఆయన ఖండించారు.

More Telugu News