Kesineni Nani: నీ బతుక్కి ఒక్క బిల్లు కూడా ప్రవేశపెట్టింది లేదు.. సచ్చింది లేదు: కేశినేని నానిపై పీవీపీ ఫైర్

  • ఈనాడు, ఆంధ్రజ్యోతిలపై ఫిర్యాదు చేసిన విజయసాయిరెడ్డి
  • సాక్షి మాత్రమే ఉండేలా చట్టం చేయమంటే పోలా అంటూ కేశినేని నాని ఎద్దేవా
  • ఆ పనేదో నువ్వే చేసి పుణ్యం కట్టుకోమన్న పీవీపీ

ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై లోక్ సభ స్పీకర్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తన మర్యాదకు భంగం కలిగించేలా వార్తలను ప్రచురించారని, వాటిపై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. దీనిపై టీడీపీ ఎంపీ కేశినేని నాని తనదైన స్టైల్లో విమర్శలు గుప్పించారు. ఈ గోలంతా ఎందుకు... మన సాక్షి టీవీ, సాక్షి పేపరు మాత్రమే ఉండేలా చట్టం చేయమంటే పోలా అంటూ ఎద్దేవా చేశారు.

దీనికి కొనసాగింపుగా... కేశినేని నానిపై వైసీపీ నేత పొట్లూరి వర ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చట్ట సభలో చట్టాలు చేసేవారిలో నీవు కూడా ఒకడివని... ఆ పనేదో నువ్వే చేసి పుణ్యం కట్టుకో అని వ్యాఖ్యానించారు. ఎలాగూ నీ బతుక్కి ఒక్క బిల్లు కూడా ప్రవేశపెట్టింది లేదు, సచ్చింది లేదని ఎద్దేవా చేశారు. 'కావాలంటే తాను ఇంగ్లీషులో రాసిపెడతా నిశానీ దొరగారూ' అంటూ ట్వీట్ చేశారు.

More Telugu News