Guntur District: గుంటూరు రూరల్ ఏరియాలో సెల్ఫీలపై నిషేధం

  • కండ్లకుంట వద్ద విద్యార్థిని మృతి
  • అప్రమత్తమైన పోలీసులు
  • కృష్ణానది, ఇతర కాల్వల వద్ద సెల్ఫీలపై ఆంక్షలు

గుంటూరు గ్రామీణ పరిధిలో కృష్ణానది, ఇతర కాల్వల వద్ద సెల్ఫీలు తీసుకోవడంపై పోలీసులు నిషేధం విధించారు. కండ్లకుంట వద్ద సెల్ఫీ దిగే ప్రయత్నంలో ఓ విద్యార్థిని మృత్యువాత పడడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ మేరకు గుంటూరు రూరల్ ఎస్పీ విజయరావు ఆదేశాలు జారీ చేశారు. పులిచింతల రిజర్వాయర్లో మొసళ్లు ఉన్నాయని, అక్కడ సెల్ఫీలు తీసుకునే క్రమంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ముప్పు తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అంతేగాకుండా, జలాశయాలు, కాల్వల సమీపంలో ఫొటోలు దిగొద్దంటూ హెచ్చరికలతో కూడిన బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.

More Telugu News