Galla Jaydev: కొత్త పొలిటికల్ మ్యాప్ లో అమరావతి లేకపోవడం ఏపీకి మాత్రమే కాదు మోదీకి కూడా అవమానం: గల్లా

  • కొత్త పొలిటికల్ మ్యాప్ విడుదల చేసిన కేంద్రం
  • కనిపించని అమరావతి
  • లోక్ సభ జీరో అవర్ లో ప్రశ్నించిన గల్లా

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన భారతదేశ సరికొత్త పొలిటికల్ మ్యాప్ లో ఏపీ రాజధాని అమరావతి లేదంటూ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఓ రాష్ట్ర రాజధానికి దేశ రాజకీయ నైసర్గిక ముఖచిత్రంలో స్థానం లేకపోవడం ఏపీకి మాత్రమే కాకుండా ప్రధాని నరేంద్ర మోదీకి కూడా అవమానకరమేనని అన్నారు. అమరావతికి శంకుస్థాపన చేసింది ప్రధాని మోదీయేనని వివరించారు. లోక్ సభలో జీరో అవర్ సందర్భంగా గల్లా జయదేవ్ మాట్లాడుతూ, ఈ విషయాన్ని ఎత్తిచూపారు. అమరావతిని ఏపీ రాజధానిగా ప్రస్తావిస్తూ మ్యాప్ ను సవరించాలని కేంద్రాన్ని కోరుతున్నట్టు తెలిపారు.

More Telugu News