Chiranjeevi: 50 రోజులు పూర్తి చేసుకున్న 'సైరా'

  • అక్టోబర్ 2వ తేదీన వచ్చిన 'సైరా'
  • వసూళ్ల విషయంలో కొత్త రికార్డులు 
  •  సక్సెస్ కోసం కృషి చేసిన టీమ్    

చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'సైరా' అక్టోబర్ 2వ తేదీన భారీస్థాయిలో ప్రేక్షకులను పలకరించింది. భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ఈ సినిమా, కొత్త రికార్డులకు తెరతీస్తూ వెళ్లింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా నిన్నటితో 50 రోజులను పూర్తి చేసుకుంది. 30 సెంటర్లలో ఈ సినిమా 50 రోజులను పూర్తిచేసుకోవడం విశేషం.

ఆయా ప్రాంతాల్లోని మెగా అభిమానులు అర్థ శతదినోత్సవ వేడుకలను జరపడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి జీవించిన తీరు విశేషంగా ఆకట్టుకుంది. నిండుతనం కలిగిన సిద్ధమ్మ పాత్రలో నయనతార .. త్యాగమే జీవితంగా భావించిన లక్ష్మి పాత్రలో తమన్నా నటన ప్రేక్షకులను మెప్పించాయి. సంగీతం .. ఫొటోగ్రఫీ .. టేకింగ్ ఈ సినిమాను మరో మెట్టుపై నిలబెట్టాయి. ఇలా అన్ని శాఖలు కీలకమైన పాత్రను పోషించడమే ఈ సినిమా ఈ స్థాయి విజయాన్ని సాధించడానికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

More Telugu News