Nikhil: ఆలస్యమైనా నిఖిల్ మంచి ఆఫర్లే పట్టేశాడు

  • యువ కథానాయకుల రేసులో నిఖిల్ 
  • తాజా చిత్రంగా రానున్న 'అర్జున్ సురవరం'
  • విడుదలకి ముందే రెండు ఆఫర్లు

యువ కథానాయకులతో పోటీపడుతూ నిఖిల్ దూసుకుపోతున్నాడు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'అర్జున్ సురవరం' విడుదల విషయంలో కొంత జాప్యం జరిగింది. మొత్తానికి అడ్డంకులు తొలగిపోయి, విడుదల తేదీని ఖరారు చేసుకుంది. ఈ నెల 29వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే నిఖిల్ రెండు ఆఫర్లను దక్కించుకున్నాడు. యూవీ క్రియేషన్స్ - గీతా ఆర్ట్స్ 2వారు సంయుక్తంగా ఈ రెండు సినిమాలను నిర్మించనున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఒక సినిమాను, ద్వితీయార్థంలో రెండవ సినిమాను పట్టాలెక్కించనున్నారు. ఈ రెండు సినిమాలు కూడా యువదర్శకులకి అప్పగిస్తారట. త్వరలోనే ఈ సినిమాలకి సంబంధించిన పూర్తి వివరాలను తెలియపరచనున్నారు.

More Telugu News