Group-2 Examination Telangana: గ్రూప్-2 ఫైనల్ ప్రొవిజనల్ జాబితాపై తెలంగాణ హైకోర్టు స్టే

  • తదుపరి ఆదేశాలు వచ్చేవరకు నియామకాలు నిలిపివేయాలంటూ ఆదేశాలు
  • గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఉల్లంఘించారన్న పిటిషనర్లు
  • ఈ మేరకు టీఎస్ పీఎస్ సీకు ఆదేశాలు జారీ

తెలంగాణలో నిర్వహించిన గ్రూప్-2 పరీక్షకు సంబంధించి వెలువడ్డ ఫైనల్ ప్రొవిజనల్ ఫలితాల జాబితాపై హైకోర్టు స్టే జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు ఎలాంటి నియామకాలు చేపట్టరాదని టీఎస్ పీఎస్ సీకి ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్-2 కేసులో గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును ధిక్కరిస్తూ టీఎస్ పీఎస్ సీ వ్యవహరించిందని గ్రూప్-2 అభ్యర్థులు తమ పిటిషన్ లో పేర్కొన్నారు.

 వైట్ నర్, ట్యాంపరింగ్, క్రాచింగ్ చేసిన అభ్యర్థులను ఎంపిక చేయవద్దని పిటిషన్లో కోరారు. కాగా, 2016 లో జరిగిన ఈ పరీక్షకు సంబంధించి అభ్యర్థులు పరీక్ష నిర్వహణ నిబంధనలపై అప్పట్లోనే హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో దీర్ఘ కాలంగా కోర్టులో విచారణ జరిగింది. ఇటీవల కోర్టు తీర్పుతో టీఎస్ పీఎస్ సీ ఫైనల్ ప్రొవిజనల్ జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ అభ్యర్థులు ఫైనల్ జాబితాపై కూడా పిటిషన్ వేశారు.

More Telugu News