RTC JAC meet: ముగిసిన ఆర్టీసీ జేఏసీ సమావేశం

  •  లేబర్ కమిషన్ కు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల పరిశీలన  
  •  సమ్మె కొనసాగింపుపై కార్మిక సంఘాల భిన్నాభిప్రాయాలపై నిర్ణయం ?
  •  రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ  

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో భేటీ అయిన జేఏసీ పలు నిర్ణయాలను తీసుకుందని, త్వరలోనే జేఏసీ ఈ విషయమై ప్రకటన చేయనుందని  తెలుస్తోంది. లేబర్ కమిషన్ కు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పరిశీలించిందని, సమ్మె కొనసాగింపుపై కార్మిక సంఘాల్లో ఏర్పడ్డ విభేదాలపై, కార్మిక సంఘాలు వెలిబుచ్చుతున్న భిన్నాభిప్రాయాలపై జేఏసీ నిర్ణయం తీసుకోనుందని సమాచారం. మరోవైపు ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలను కోర్టులో వినిపిస్తున్నారు.

More Telugu News