Sandeep Madhav: 'జార్జిరెడ్డి' సెన్సార్ పూర్తి.. విడుదలకి సిద్ధం

  • విద్యార్థి నాయకుడి బయోపిక్ గా 'జార్జి రెడ్డి'
  • సెన్సార్ నుంచి U/A సర్టిఫికేట్
  •  ఈ నెల 22వ తేదీన విడుదల

సందీప్ మాధవ్ కథానాయకుడిగా 'జార్జిరెడ్డి' అనే విద్యార్థి నాయకుడి బయోపిక్ రూపొందింది. జీవన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ఈ నెల 22వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ ను మంజూరు చేశారు.

'జార్జిరెడ్డి' సినిమాను గురించి చిరంజీవి .. నాగేంద్రబాబు .. పవన్ కల్యాణ్ తదితరులు ప్రస్తావించడంతో, సహజంగానే ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి పెరిగింది. పవన్ అభిమానులంతా కూడా ఈ సినిమా పట్ల ఆసక్తితో వున్నారు. విడుదలకి ముందు ఈ సినిమా అందరి దృష్టికి చేరడం వసూళ్లపరంగా కలిసొచ్చే విషయం. యూత్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ సినిమా, ఏ స్థాయిలో వారికి కనెక్ట్ అవుతుందో చూడాలి.

More Telugu News